కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలిః మంత్రి ఈటెల

327
Minister Etela
- Advertisement -

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిని సందర్శించారు మంత్రి. ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్‌ వార్డులను మంత్రి పరిశీలించారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.

చిన్న చిన్న జాగ్రాత్తలు పాటిస్తే.. కరోనా దరికి చేరదని మంత్రి వెల్లడించారు. కాగా మంత్రి ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని, ఆస్పత్రి సమూదాయంలో ప్రత్యేకంగా ఉన్న భవంతిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులను వైద్యాధికారులతో కలిసి పరిశీలించారు.రెండు అంతస్తుల్లోని భవనంలో నాలుగు వార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ వార్డుల్లో వెంటిలేషన్‌తో పాటు 56 బెడ్లను సిద్దం చేశారు. కాగా, వాటితో పాటు మరో 4 సపరేటు గదులు కూడా సిద్దం చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -