మిస్ ఇండియా పోటీల్లో శివాని!

126
shivani
- Advertisement -

ఫెమినా మిస్ ఇండియా అందాల పండగొచ్చేసింది. తొలి దశ పోటీలు ఆధ్యంతం కన్నులపండువగా సాగగా తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరితో హీరో రాజశేఖర్ కుమార్తె కూడా ఎంపికైంది. తెలంగాణ నుంచి ప్రజ్ఞ అయ్యగారి, ఏపీ నుండి లిఖిత యలమంచిలి, హీరో రాజశేఖర్‌ కుమార్తె శివాని తమిళనాడు నుండి అర్హత సాధించింది.

మిస్‌ ఇండియా కిరీటం కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 31 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఒక్కరే ప్రపంచ సుందరి పోటీలకు వెళ్తారు.ప్రస్తుతం మెడిసిన్‌ చదువుతున్న శివాని…ఓ సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకుని ఈ పోటీల్లో దిగారు. విజేతగా నిలిస్తే బహుమతి రూపంలో వచ్చే డబ్బును జంతు హింసకు వ్యతి రేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినియోగిస్తానని వెల్లడించింది.

ఇక హైదరాబాద్‌కు చెందిన ప్రజ్ఞ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ స్టూడెంట్‌. అలాగే సాయి లిఖిత ఎంబీబీఎస్‌ చేశారు.

- Advertisement -