నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: శివాజీరాజా

313
shivaji raja
- Advertisement -

మా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు,సినీ నటుడు శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాగబాబు తనకు గిఫ్ట్ ఇచ్చారని ఆయనకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. నాగబాబు తనకు 30 ఏళ్లుగా పరిచయం అని తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరని కానీ ఇటీవల ఎన్నికల్లో తనకు ఆయన ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్ ఇస్తానని అదేంటి అనేదని తర్వాత చెబుతానని తెలిపారు.

దస్పల్లా హోటల్‌లో మా అసోసియేషన్ సభ్యులు 200 మందికి నరేష్ ప్యానల్  మందు పార్టీ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు శివాజీ రాజా. ఈ విషయంపై రాజశేఖర్ చెప్పాలన్నారు. రాజశేఖర్ అంటే తనకు గౌరవం ఉందని ఆయన ఉన్నది ఉన్నట్లు చెబుతారని ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలన్నారు. మా అధ్యక్షుడు నరేష్‌ను తానే మా పీఠంపై కూర్చోబెట్టి మంచిగా పనిచేయాలని కోరుతానని తెలిపారు.నరేష్ తనపై చేసిన వన్ని ఆరోపణలే అని తెలిపారు. ఇకనైన హుందాగా ఉండాలని నరేష్‌కు సూచించారు శివాజీరాజా.

శ్రీరెడ్డికి మాసభ్యత్వం ఇవ్వొద్దని కొంతమంది,ఇవ్వాలని మరికొంతమంది అన్నారని మా అధ్యక్షుడిగా తనకు ఓ పెద్దమనిషి సైతం ఇవ్వమని చెప్పడంతో తన పొజిషన్‌లో ఎవరు ఉన్న మా సభ్యత్వం ఇచ్చి తీరుతారని చెప్పారు.

ప్రతి సంవత్సరమూ ‘మా’ డైరీని అందంగా డిజైన్ చేసి వేస్తామని, ఈ సంవత్సరమూ బాగా చేశామని అన్నారు. డైరీ వేసినందుకు రూ. 14.20 లక్షలు వచ్చిందని గొప్పగా చెప్పుకున్న నరేష్, కేవలం రూ. 7.20 లక్షలు మాత్రమే ఖాతాలో వేశారని, మిగతా డబ్బు ఏమైందని ప్రశ్నించారు శివాజీరాజా. తాను లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందని, ఒకటో తేదీలోగా మిగతా డబ్బు ‘మా’ ఖాతాలో వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మిగతా డబ్బు ఎక్కడుందో చెప్పి, వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

మా ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన, మీడియాతో తనకు ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉందని, తాను కుట్రలు చేసేవాడినో, కాదో మీడియా మొత్తానికీ తెలుసునని అన్నారు.

- Advertisement -