ఆమె ఇక లేరని తెలిసి షాకయ్యాను..

238
She is shocked to know that she is no longer..
- Advertisement -

ప్రముఖ భారతీయ సినీ నటి దివంగత శ్రీదేవి తన అద్బుతమైన నటనతో అనేకమంది అభిమానులను సంపాదించకున్నారు. తొలితరం నటీనటులతో కలిసి నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె కాలం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవితో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొస్తూ శ్రీదేవి నాకు అమ్మలాంటి దని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణే. ఆమెతో తనుకున్న ప్రత్యేకమైన అనుబంధం ఉండేదని చెప్పారు.

 She is shocked to know that she is no longer..

ఇంటర్య్యూలో దీపికా మాట్లాడుతూ…‘శ్రీదేవితో నాకు సినిమాలకు మించిన అనుబంధం ఉంది. ఆమె నాకు తల్లిలాంటివారు. నేను నటించచిన ప్రతి సినిమా చూసి బోనీ కపూర్‌, శ్రీదేవి నాకు ఫోన్‌ చేసి అభినందనలు చెప్పేవారు. ఆమెతో ఉంటే నాకు చాలా సౌకర్యంగా ఉండేది. దుబాయ్‌కి వెళ్లే కొద్ది రోజుల ముందు శ్రీదేవి నాతో మాట్లడారు. కానీ ఆమె అక్కడే చనిపోతారని నేను అస్సలు ఊహించలేదని ఆమె ఇక లేరని తెలిసి తట్టుకోలేకపోయానని’ తెలిపారు. కాగా ప్రస్తుతం దీపికా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ‘సప్నా దీదీ’ అనే బయోపిక్‌లో నటిస్తున్నారు.

 

- Advertisement -