పెట్రో ధ‌ర‌ల పెంపుపై శ‌శిథ‌రూర్ వినూత్న రీతిలో నిర‌స‌న..

171
Shashi Tharoor
- Advertisement -

దేశంలో పెట్రో ధ‌ర‌ల పెంపుపై కాంగ్రెస్‌ ఎంపీ శ‌శిథ‌రూర్ వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు. ఆయన కేరళ రాజధాని తిరువనంతపురంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.ఆటోలకు తాళ్లు కట్టి రోడ్డుపైకి లాక్కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను థరూర్ పంచుకున్నారు. కాంగ్రెస్ నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో వందలాది ఆటోలు పాల్గొన్నాయని థరూర్ వివరించారు. చమురు ధరలు తగ్గించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ విఫలమయ్యాయని విమర్శించారు. ఆ విషయాన్ని ఎత్తిచూపేందుకు ఆటోలను తాళ్లతో లాగామని వివరించారు. చమురు ధరల పెంపుతో ప్రజలను దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

- Advertisement -