ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల!

22
- Advertisement -

ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇక ప్రధానంగా ఏపీపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ సత్తాచాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక దాదాపు ఖరారు కావడంతో ఆమెను ఏపీసీసీ చీఫ్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆమె రేపు ఢిల్లీ వెళ్తుండటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా షర్మిలను పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి పిలుపు రాగానే షర్మిల ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.

వాస్తవానికి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రతిపాదించింది షర్మిల. అయితే తెలంగాణ ఎన్నికలు ఉండటంతో దానికి బ్రేక్ పడింది. తాజాగా ఏపీలో ఎన్నికలు వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారు.

Also Read:ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు!

- Advertisement -