శాంతి కుమారి నేపథ్యం ఇదే..

56
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఎ. శాంతి కుమారి. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోగా ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.15 గంటలకు బీఆర్ కేఆర్ భవన్ లో భాద్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపారు శాంతి కుమారి.

తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా శాంతి కుమారి నిలిచారు. బాధ్యతలు చేపట్టనున్నారు. 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన శాంతి కుమారి. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు.

గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్‌కు కలెక్టర్‌గా కూడా పనిచేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -