టీఆర్ఎస్‌లో భారీగా చేరిక‌లు..

83
trs
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి త‌ప్ప ఏ పార్టీల‌ను ప్ర‌జ‌లు ఆద‌రించ‌ర‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. గురువారం దేవ‌రుప్పుల మండ‌లం రంబోజీగూడెం, రాజీవ్‌న‌గ‌ర్ గ్రామాల‌కు చెందిన ప‌లువురు మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు స‌మ‌క్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన రాంపెల్లి యాద‌గిరి, చౌడం సోమ‌య్య‌, గొడుగు వెంక‌టేశ్వ‌ర్లు, పుప్పాల వెంక‌ట‌య్య‌ల‌తోపాటు 30మందికి గులాభీ కండువాలు క‌ప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు చేస్తున్న అభివృద్దితో తాము టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న‌ట్లు పార్టీలో చేరినవారు తెలిపారు.

- Advertisement -