టీపీసీసీ చీఫ్‌గా సీతక్క!

12
- Advertisement -

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీతక్క పేరు ఖరారైందా?,సీఎం రేవంత్ రెడ్డి పార్టీపై తన పట్టు నిలుపుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి….కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ,నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చించనున్నారు.

టీపీసీసీ చీఫ్‌గా ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీతక్కకు ఢిల్లీ నుండి పిలుపురావడంతో ఆమెకు పీసీసీ చీఫ్ పదవి ఖరారైనట్లేనని సమాచారం. ఒకవేళ బీసీ వర్గానికి ఇవ్వాలని భావిస్తే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రచారంలో ఉంది. మహేష్ కుమార్ గౌడ్ సైతం ఢిల్లీలో ఉండటంతో వీరిద్దరిలో ఒకరికి పీసీసీ చీఫ్ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు.

ఇక జూలై 2న మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. మంత్రి పదవి కోసం చాలా మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:Gold Rate:లేటెస్ట్ ధరలివే

- Advertisement -