జబర్ధస్త్ ని రిజెక్ట్ చేసిన జయసుధ..ఎందుకో తెలుసా?

507
Jabardasth jayaudha
- Advertisement -

బుల్లితెరపై వచ్చే కామెడీ షోలలో జబర్ధస్త్ టాప్ ప్లేస్ లో ఉంది. ఇందులో వచ్చే కమెడియన్ లు పలువురు వెండితెరపై కూడా సందడి చేస్తున్నారు. ఎంతో మంది ఆర్టీస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈజబర్ధస్త్ కామెడీ షో. అయితే ఈషో ప్రారంభం నుంచి ఇప్పటివరకూ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది జడ్జస్ రోజా, నాగబాబు అని చెప్పుకోవాలి. అయితే గత కొద్ది రోజులుగా వారిద్దరూ జబర్ధస్త్ షో మానేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటివలే జరగినే సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరూ బిజీగా ఉండటంతో వాళ్లు ప్లేస్ లో శేఖర మాస్టర్, సీనియర్ హీరోయిన్ మీనాను తీసుకున్నారు.

అయితే నాగబాబు, రోజా ఇక జబర్దస్త్ కు గుడ్ చెప్పనున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇకపై వారు పూర్తీగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. అయితే రోజ స్ధానంలో జడ్జ్ గా సీనియర్ హీరోయిన్ జయసుధని సంప్రదించారట మల్లెమాల టీం. కానీ ఈ ఆఫర్ ను ఆమె సున్నితంగా తిరస్కరించిందట. కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ క్లాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత కూడా కుటుంబ విలువలు ఉన్న పాత్రల్లో నటిస్తూ సక్సెస్ అవుతున్నారు.

ఇలాంటి నేపధ్యంలో వల్గర్ కామెడీ తనకు సూట్ అవ్వదని జయసుధ సున్నితంగా తనకు వచ్చిన ఆఫర్ ని నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ షోకి జడ్జ్ గా చేయడానికి జయసుధకు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. కానీ ఆమె మాత్రం తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసిందట. జయసుధ నో చెప్పడంతో ఆమె ప్లేస్ లో సీనియర్ హీరోయిన్ మీనాను తీసుకున్నారు. ప్రస్తుతం జబర్ధస్త్ షో కు న్యాయ నిర్ణేతలుగా శేఖర్ మాస్టర్, మీనా లు చేస్తున్నారు.

- Advertisement -