కేజ్రీ ప్రమాణస్వీకారానికి టీచర్స్‌కు ఆహ్వానం

444
delhi cm
- Advertisement -

మూడోసారి సీఎంగా ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు ఆప్ చీఫ్, అరవింద్ కేజ్రీవాల్. రాంలీలా మైదారంలో జరిగే ఈ కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతుండగా ఇప్పటికే వివిధ పార్టీల నేతలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.

తాజాగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,వైస్ ప్రిన్సిపాల్స్‌,టీచర్స్‌ని ఆహ్వానించారు సీఎం కేజ్రీవాల్. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారు కేజ్రీవాల్. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లు తయారుకావడంతో ప్రజలకు కేజ్రీవాల్‌పై నమ్మకం పెరిగింది.దీనికి తోడు కేజ్రీవాల్ అవినీతి లేని పాలన మూడోసారి ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చేలా చేసింది.

- Advertisement -