9999 మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్ బలరాం..

275
SCCL-Director-N-Balaram
- Advertisement -

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ N బలరాం గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా 1151 మొక్కలను నస్పూర్ కాలనీలో నాటడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి మనుగడకు మొక్కలు నాటడం అనేది అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం తెలంగాణకు హరితహారం అని, సంతోష్ కుమార్ మెంబర్ అఫ్ పార్లమెంట్ ఇచ్చిన ఛాలెంజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందులో భాగంగా ఈ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ N శ్రీధర్ IAS సూచనలతో శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్ కాలనీలో 1151 మొక్కలను నాటడం జరుగుతుందని చెప్పారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వ్యాపించి ఉన్న ఆరు జిల్లాలలో N బలరాం మొక్కలు నాటడం జరిగింది అని చెప్పారు. బలరాం గారు ఈరోజుతో 9999 మొక్కలు నాటడం జరిగింది అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక ఛాలెంజ్ గానే కాకుండా ఒక అలవాటుగా చేసుకుని మానవ జాతి మనుగడకు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని ఒక వ్యక్తికి సంవత్సరానికి కావలసిన ఆక్సిజన్ మూడు ముక్కలు కలిసి ఇవ్వగలవని చెప్పారు. ప్రపంచ దేశాలు అన్ని గ్రీన్ చాలెంజ్ స్వీకరించి ఆయా దేశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేపడుతు న్నారని ఈ సందర్భంగా డైరెక్టర్ గుర్తు చేశారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ.. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణకి ఇచ్చిన సలహాను పాటించి SRP 1 నుండి ఊరు శ్రీరాంపూర్ వరకు ఉన్న డివైడర్ లలో మొక్కలను నాటడం అభినందనీయమని అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ గారిని ఎమ్మెల్యే అభినందించారు. భారతదేశంలోని ఏ సివిల్ సర్వీస్ అధికారి ఇప్పటివరకు సాధించని ఘనతను సాధించిన వారిగా చరిత్ర పుటల్లోకి ఎక్కరని జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ చెప్పారు. ఒక చెట్టు జీవించినంత కాలము మానవ జాతికి కావలసిన స్వచ్ఛమైన ఆక్సిజన్ అందజేస్తోందని చెప్పారు. ఈ ఆక్సిజన్ వలన మానవజాతి యొక్క జీవితకాలం పెరుగుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో ఆవశ్యకమని చెప్పారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు కావలసిన ఏర్పాట్లు చేసినందుకు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణకు డైరెక్టర్ బలరాం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజి రెడ్డి మాట్లాడుతూ.. డైరెక్టర్ గా పని చేస్తునే N బలరాం పర్యావరణాన్ని పరిరక్షించడానికి తమ వంతు మొక్కలు నాటడం చాలా అభినందనీయమని చెప్పారు. డైరెక్టర్ N బలరాం పర్యావరణ ప్రేమికులు అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొలీకెరి, SO to డైరెక్టర్ ప్రాజెక్ట్ & ప్లానింగ్ A రమేష్ రావు గారు, IPS అశోక్ కుమార్, DCP ఉదయ్ కుమార్ రెడ్డి, ACP నరేందర్, ఏరియా ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, SO to GM J కుమార స్వామి, CMOAI సెక్రటరీ మాధవ్, శ్రీరాంపూర్ అన్ని విభాగాల అధిపతులు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నస్పుర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, నస్పూర్ మున్సిపల్ కమిషనర్ రాధా కిషన్, 8 మెన్ కమిటీ సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, వీరభద్రయ్య, 6 మెన్ కమిటీ సభ్యులు అన్నయ్య, పెట్టం లక్ష్మణ్ పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -