మొక్కలు నాటిన కొత్తగూడెం సీఎంఓ..

1186
SCCL CMO M Srinivas Rao
- Advertisement -

జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా సీఎంఓ మంతా శ్రీనివాస్ మొక్కలు నాటడం జరిగింది. డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పద్మజ, భూపాలపల్లి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కొత్తగూడెం ప్రధాన ఉన్నత వైద్య అధికారి మంతా శ్రీనివాస్ రావు ఈ రోజు కొత్తగూడెంలోని ప్రధాన వైద్య కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.

CMO M Srinivas

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వాతావరణంలోని హెచ్చుతగ్గులు సమతుల్యత పాటించాలి అంటే మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంతోష్ కుమార్ అనుకున్న పదికోట్ల మొక్కలు నాటే లక్ష్యానికి మనవంతుగా సహకారం అందించాలని కోరారు.

SCCL CMO

ముఖ్యంగా మన సింగరేణి ప్రాంతంలో విపరీతంగా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు ఉంటాయి కావున దీన్ని మనం గోల్డ్ ఛాలెంజ్‌గా తీసుకుని అందరూ విరివిగా మొక్కలు నాటి మనకు, భావితరాలకు మంచి ఆరోగ్య కరమైన వాతావరణం అందించాలి అని కోరారు . ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎంఓ నళిని, కమ్యూనికేషన్ సెల్ సిబ్బంది మరియు తోటి ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -