అర్నాబ్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు..

169
arnab
- Advertisement -

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని, అతనితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ చంద్రచుడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. రూ.50,000 పూచీకత్తు కింద మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని, ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని సుప్రీం ఆదేశించింది.

బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన అర్నాబ్‌కు తాజా తీర్పు కొంత ఊరటనిచ్చింది.రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదన్న కారణంగా ఆర్కిటెక్ట్- ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ అర్నాబ్ సహా మరో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -