డ్రగ్స్ కేసులో నటి రాగిణి ద్వివేదికి బెయిల్‌..

139
Actress Ragini Dwivedi
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేదికి గురువారం సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేడాది వెలుగుచూసిన డ్రగ్స్ స్కాంలో నటి రాగిణితో పాటు మరో హీరోయిన్ సంజన గల్రానీని కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని, రేవ్ పార్టీల పేరుతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, డ్రగ్స్ కలిగి ఉన్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి.

అరెస్ట్ తర్వాత రాగిణి కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, నవంబరు 3న జరిగిన విచారణలో చుక్కెదురైంది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న అనంతరం నటికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, రాగిణి నివాసంలో ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదని, ఇతర నిందితుల వాంగ్మూలం ఆధారంగానే ఆమెను అరెస్ట్ చేశారని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

- Advertisement -