మొక్కలు నాటిన శాట్ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డి..

162
venkateshwar reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణంలో మొక్కలు నాటారు శాట్ చైర్మెన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి. ఈ సందర్భంగా శాట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్యం తగ్గాలని హరిత తెలంగాణ సహకారం కావాలనే ఉద్దేశ్యంతో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మా అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపింది అని రానున్న రోజుల్లో మా క్రీడాకారుల అందరి చేత మొక్కలు నాటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈరోజు నా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ లో రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, సరూర్ నగర్ స్టేడియం అధికారి వెంకటేశ్వరరావు, జయశంకర్, శ్రీనివాస్, నవీన్ వర్మ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -