సత్యరాజ్.. ‘వెపన్’

12
- Advertisement -

మిర్చి, బాహుబలి సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్, అశ్విన్స్, జైలర్ చిత్రాల్లో మెప్పించిన యాక్టర్ వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్బంగా జరిగిన ప్రెస్ మీట్‌లో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ మీనన్, నిర్మాత మన్సూర్, పివిఆర్ హెడ్ మీనా, రాజీవ్ పిళ్లై, డైరెక్టర్ గుహన్ సెన్నియప్పన్ తదితరులు పాల్గొన్నారు.

సత్యరాజ్ మాట్లాడుతూ ‘‘వెపన్’ లాంటి ఓ సినిమాను తీయాలంటే నటీనటులకంటే ముందుగా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్స్ వాళ్లే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్ కు ప్రాధాన్యత అని నా అభిప్రాయం. వెపన్ సినిమా విషయానికి వస్తే చాలా మంచి టీమ్ కుదిరింది డిఫరెంట్ కాన్సెప్ మూవీ. నిర్మాతలైతే మరో ఆలోచన లేకుండా ఖర్చు పెట్టి సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారు. డైరెక్టర్ గుహన్ అయితే సరికొత్త విజన్ తో సినిమాను ఆవిష్కరించారు. వసంత్ రవి ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు. తన నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాన్యా హోప్, రాజీవ్ మీనన్, రాజీవ్ పిళ్లై ఇలా అందరూ చక్కగా వర్క్ చేశారు. బాహుబలి కంటే ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్స్ లో నటించాను. అయితే చక్కగా ఫైట్ మాస్టర్ డిజైన్ చేయటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సన్నివేశాలను పూర్తి చేశాం. త్వరలోనే సినిమాను మీ ముందుకు తీసుకు రావటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అన్నారు.

Also Read:నేచురల్ స్టార్ నాని @ 15

- Advertisement -