సెమీస్‌ను ఎంజాయ్ చేశా..సత్యనాదేళ్ల

29
- Advertisement -

ముంబైలోని వాంఖడే వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ సెమీస్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెమీస్‌లో భారత్ అద్భుత ఆటతీరు కనబర్చి 70 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రెటీలు స్వయంగా స్టేడియంకు వచ్చి మ్యాచ్ తిలకించగా కోట్లాది మంది భారతీయులు టీవీలకు అతుక్కుపోయారు.

ఇక తాను మ్యాచ్‌ను చూసినట్లు వెల్లడించారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల. రాత్రంతా మేల్కొని మరీ భారత్‌ – న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను చూశానని తెలిపారు. ఇగ్నైట్‌ పేరిట సియాటెల్‌లో మైక్రోసాఫ్ట్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ను షెడ్యూల్‌ చేసిన రోజే వన్డే ప్రపంచకప్‌ 2023 సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందని తెలియదని..కాన్ఫెన్స్‌లో ఉపన్యాసం ముగిసిన తర్వాత మ్యాచ్‌లో మునిగిపోయానని తెలిపారు. భారత్‌ విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు.

Also Read:జామ ఆకులతో ఉపయోగాలు తెలుసా!

- Advertisement -