సంచలన నిర్ణయం తీసుకున్న శశికళ..!

158
sasikala
- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు రోజురోజుకు మలుపు తిరుగుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయాలకు గుడ్ బై చెబుతూ షాకింగ్ డిసిషన్ తీసుకుంది.

జయలలిత జీవించి ఉన్నప్పుడు కూడా నేను అధికారం కోసం లేదా పార్టీలో స్థానం కోసం ఎన్నడూ పాకులాడలేదు.. ఆమె చనిపోయిన తర్వాత కూడా వాటి కోసం ఆశపడడంలేదంటూ లేఖలో పేర్కొన్నారు శశికళ. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను ఓడించాలంటూ.. అన్నా డీఎంకే కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఆమె.. జయలలిత బంగారు పాలన తమిళనాడులో కొనసాగాలని ఆకాంక్షించారు.

అన్నా డీఎంకేను అధికారంలో తీసుకురావటమే తన లక్ష్యమని చెబుతూ ప్రకటించి…జైలు నుండి భారీ ర్యాలీతో ఆకట్టుకున్న శశికళ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయాల నుండి తప్పుకున్నట్లు ప్రకటించి అందరిని విస్మయానికి గురిచేశారు.

- Advertisement -