‘సర్కారు వారి పాట’ ష్యూటింగ్‌ పూర్తి..

148
Sarkaru Vaari Paata
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట. ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. త్వరలో మరో సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్‌.

బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథ ఇది. భారీ యాక్షన్ కి కామెడీ టచ్ ఉన్న కథ ఇది. మహేష్‌ .. వెన్నెల కిశోర్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. సముద్రఖని కీలకమైన పాత్రను పోషించారు. ‘గీత గోవిందం’ తరువాత పరశురామ్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -