మొక్కలు నాటిన గౌడ హాస్టల్ కార్యవర్గం, విద్యార్దులు

373
goudhostal
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా హిమయత్‌నగర్‌లో గల గౌడ వసతిగృహ ప్రాంగణంలో హాస్టల్‌ కార్యకర్గ సభ్యులు, విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గౌడ్‌ హాస్టల్‌ ప్రెసిడెంట్‌ పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌, ఉపాధ్యక్షులు పుల్లెంల రవీందర్‌ గౌడ్‌, జ్ఞానేశ్వర్‌ గౌడ్‌, జనరల్‌ సెక్రటరీ చక్రవర్తి గౌడ్‌, ట్రెజరర్‌ శైలాజా గౌడ్‌, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ, ప్రతినిధి కిషోర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Gowda Hostel 2

ఈ సందర్భంగా పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌ మరో ముగ్గురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. వెలమ హాస్టల్‌ ప్రెసిడెంట్‌ ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌, రెడ్డి హాస్టల్‌ ప్రెసిడెంట్‌ అమ్మా మేరి, కురుమ హాస్టల్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ను గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా కోరారు.

- Advertisement -