మొక్కలు నాటిన సానియా మీర్జా..

322
sania
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మొక్కలు నాటారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నేడు ఫిలింనగర్‌లోని తన కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని దీని వల్ల మనం ప్రకృతిని రక్షించుకోవడం జరుగుతుందని. ఈ చాలెంజ్‌లో మొక్కలు నాటడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. నీను మరొక ముగ్గురికి ఛాలెంజ్ ఇస్తున్నాను అని 1) అజారుద్దీన్ భారత దేశం మాజీ క్రికెట్ కెప్టెన్ 2) జయేష్ రంజన్ (IAS) IT శాఖ ముఖ్య కార్యదర్శి 3) సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి లను మొక్కలు నాటాలని అని సానియా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సానియాకు ఎంపీ సంతోష్ ధన్యావాదాలు తెలిపారు.

- Advertisement -