కాంగ్రెస్ కు మరో షాక్.. టీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి

262
Jaggareddy
- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని విడుతుంటే ఏం చేయాలో అర్ధం కాని స్ధితిలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. రోజుకు ఒక ఎమ్మెల్యే చొప్పున పార్టీని వీడుతున్నారు. మొదట రేగ కాంతారావు, ఆత్రం సక్కు నుంచి ప్రారంభమైన ఈవలసలు తాజాగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి , కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో మొత్తం 19మంది అభ్యర్దులు విజయం సాధించగా ఇప్పటకే 8మంది పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. ఇదే బాటలో మరో 5గురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లోపు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని సమాచారం. తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నట్లు తెలుస్తుంది.

సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్ గూటికి చేరునున్నట్లు సమాచారం. జగ్గారెడ్డి నేడు తన అనుచరులతో భేటీ అయ్యారట. పార్టీ మార్పు నిర్ణయంపై చర్చించారని తెలుస్తుంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎన్నికపై సీరియస్ గా డిస్కషన్స్ చేస్తుంటే.. జగ్గారెడ్డి అందుబాటులో లేకుండా పోవటంతో చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ నేతలు ఫోన్ చేసినా స్పందించటం లేదంట. కాంగ్రెస్ కు ఫైర్ బ్రాండ్ గా ఉన్న జగ్గారెడ్డి పార్టీ మారడంతో ఆపార్టీకి తీరని లోటని చెప్పుకోవాలి. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లానుంచి గెలిచిన ఎకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం.

- Advertisement -