మొక్కలు నాటిన చర్లపల్లి జైల్ సూపరిండెంట్..

170
Sampath planted 37 saplings
- Advertisement -

తన 37వ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చర్లపల్లి జైల్ ఆవరణంలో చిన్నారులతో కలిసి 37 మొక్కలు నాటారు చర్లపల్లి జైల్ సూపర్డెంట్ మాదారపు సంపత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సందర్భంలో ఐన మొక్కలు నాటడం కోసం ప్రయత్నం చేయాలి అని పిలుపునిచ్చారు. నా 37 వ పుట్టినరోజు సందర్భంగా 37 మొక్కలు నాటడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.

ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగి ప్రపంచం అంతా విస్తరించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. అందుకోసం నీను టీం Agamiకి, నా మిత్రులు నరేంద్ర, సురేంద్రనాథ్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తన 37 వ జన్మదినం సందర్భంగా 37 మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచిన జైల్ సూపర్డెంట్ సంపత్‌ను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అభినందించడం జరిగింది.

- Advertisement -