సమ్మోహనం…ట్రైలర్

239
Sammohanam
- Advertisement -

సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం జూన్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా టీజర్‌ని ఆవిష్కరించగా తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

అసలేముందిలా ఈ స్టార్లల్లో. నటన అబద్ధం, గ్లామర్‌ అబద్ధం, మాటలు అబద్ధం. అయినా ఎగబడతారేంట్రా? అంటూ సుధీర్‌బాబు చెప్పే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌లో సినిమాలోనే మరో సినిమా ప్రపంచాన్ని చూపించారు. స్టార్ట్‌ కెమెరా..రోలింగ్‌..యాక్షన్‌ అంటూ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ అతిథి పాత్రలో కనిపించగా స్టార్లు మామూలు మనుషులు కారు. వాళ్లను చూడ్డానికి మనం డబ్బులిచ్చి థియేటర్‌కు వెళుతున్నామంటే మనలో లేనిది వారిలో ఏదో ఉంది చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది.

సినిమావాళ్ల మీద నాకున్న అభిప్రాయం తప్పనుకున్నా నిన్ను కలిసిన తర్వాత. కాదని చెంప పగలగొట్టి మరీ నిరూపించావ్‌. మనుషుల్ని వాడుకోవడం మీ ప్రొఫెషన్‌లో చాలా సాధారణం అనుకుంటా అని సుధీర్‌ చెప్పే డైలాగ్‌తో ముగిసింది ట్రైలర్‌. ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..

- Advertisement -