సమ్మోహనం..క్లీన్ యు

275
- Advertisement -

సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం జూన్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్‌ సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకుంది. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని.. క్లీన్ యు సర్టిఫికేట్‌ను అందుకుంది.

ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ప్రిన్స్ మహేష్ బాబు రానున్నాడు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. సినిమా నటీనటులతో పాటు దర్శక నిర్మాతలు,సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘మేం ముందుగా అనుకున్న విధంగానే సినిమా చాలా బాగా వ‌చ్చింది. సెన్సార్ స‌భ్యులు చూసి మెచ్చుకుని.. క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 15న ఈ మూవీని విడుద‌ల చేస్తున్నాం. అంద‌మైన క‌థ‌, అర్థ‌వంత‌మైన సంభాష‌ణ‌లు, విన‌సొంపైన బాణీలు, అద్భుత‌మైన లొకేష‌న్లు సినిమాకు ప్ల‌స్ అవుతాయి. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప్రాణం పెట్టి ప‌నిచేశారు. వివేక్ సాగ‌ర్ స్వ‌ర‌ప‌ర‌చిన పాట‌ల‌ను ఇటీవ‌ల ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశాం. చాలా మంచి స్పంద‌న వ‌స్తోందన్నారు.

sammohanam

- Advertisement -