సమీర్ మోదీకి బెయిల్ మంజూరు

4
- Advertisement -

తన మాజీ సహోద్యోగిని అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ మోదీకి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సాకేత్ జిల్లా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి దీపక్ వత్సు. వ్యాపారవేత్త, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ తమ్ముడు సమీర్ మోదీ.

సెప్టెంబర్ 23న, వ్యాపారవేత్త సమీర్ మోదీ బెయిల్ పిటిషన్‌పై రెండు వైపులా వాదనలు విన్న అనంతరం అదనపు సెషన్స్ జడ్జి విపిన్ ఖరబ్ తీర్పును రిజర్వ్ చేశారు. సమీర్ మోదీ ప్రభావవంతుడు మరియు పారిపోయే అవకాశం ఉందని చెబుతూ ఢిల్లీ పోలీసులు బెయిల్ పిటిషన్‌కు వ్యతిరేకంగా వాదించారు.

బాధితురాలి తరఫున సీనియర్ అడ్వొకేట్ గీతా లూత్రా, శుభమ్ మహాజన్ మరియు రవీష్ తుక్రాల్ సమర్పణలు చేసిన తర్వాతనే కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
సమీర్ మోదీ తరఫున సీనియర్ అడ్వొకేట్ రమేష్ గుప్తా, శైలేంద్ర సింగ్ మరియు సూర్య ప్రతాప్ సింగ్ హాజరై బాధితురాలి ఆరోపణలను తిరస్కరించారు.

సెప్టెంబర్ 18న లండన్ నుండి తిరిగి వచ్చిన సమీర్ మోదీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 10న న్యూ ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్లో భారతీయ దండన చట్టంలోని సెక్షన్ 376 (అత్యాచారం), 506 (ఫిర్యాదు దారుణికి బెదిరింపు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు.

సెప్టెంబర్ 19న సాకేత్ కోర్టు ఢిల్లీ పోలీసులకు సమీర్ మోదీపై రెండు రోజుల రిమాండ్ మంజూరు చేసింది. ఆదివారం ఆయనను న్యాయపరమైన కస్టడీకి పంపించారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, 2019 నుండి సమీర్ మోదీ తనను పదేపదే అత్యాచారం చేసి, బెదిరించి, మోసం చేశాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి తనను సంప్రదించి, 2019 డిసెంబర్‌లో న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని తన నివాసంలో బలవంతంగా అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు.

Also Read:వెనిజులాలో భారీ భూకంపం

- Advertisement -