హీరోయిన్ సమంత అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ఆరోగ్య పరిస్థితిపై నెటిజన్లుకు సమంత రిప్లై ఇస్తూ చికిత్సలో భాగంగా ”చాలా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. దానివల్ల నా చర్మం దెబ్బతింది, పిగ్మంటేషన్ వచ్చింది. చాలామంది అందం విషయంలో నా పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అందం ఎవరికీ శాశ్వతం కాదు. మంచి మనసు ఉంటే.. అది అన్నిటికీ మించి గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇక ప్రస్తుతం సిటాడెల్లో యాక్షన్ రోల్ చేస్తున్నాను. నేను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఈ స్థాయిలో ఉంటానని అసలు ఊహించలేదు” అని సమంత చెప్పుకొచ్చింది.
అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కూడా సమంత స్పందించింది. సల్మాన్ఖాన్ తో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అని సమంత క్లారిటీ ఇచ్చింది. అభిమానులతో జరిపిన చిట్చాట్లో సమంత ఇంకా మాట్లాడుతూ… ప్రస్తుతం నేను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నా. సినిమాల విషయంలో మరింత సెలెక్టివ్గా ఉండాలనుకుంటున్నా. ఏదైనా సినిమా ఖరారైతే ఆ వివరాల్ని వెంటనే మీతో పంచుకుంటా అని సమంత చెప్పింది.
ఐతే, సమంత ఇన్స్టా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. కమెడియన్ వెన్నెల కిశోర్తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ కామెంట్ చేసింది. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఖుషి సినిమాలో కూడా వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటించారు. మరోవైపు ఇన్స్టా వేదికగా సమంత ఫ్యాన్స్తో కాసేపు చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పింది
Also Read:కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలు..!