నాకు ప్రాణహాని ఉంది.. సమంత పోస్ట్‌ వైరల్‌..

86
- Advertisement -

టాలీవుడ్‌లో మోస్ట్ క్యూటెస్ట్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్న నాగ చైత‌న్య, స‌మంత‌లు గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న విడిపోతున్న‌ట్లు ప్రకటించిన సంగతి తెలసిందే. అయితే సామ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర పోస్టులు పెడుతోంది.. అవి నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా హాలీవుడ్‌ హాస్యనటుడు విల్‌ స్మిత్‌ పుస్తకం నుంచి ఓ కోట్‌ను షేర్‌ చేసింది సామ్‌. అందులో.. ‘గత 30 ఏళ్లుగా అందరిలాగే నేను కూడా వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు వంటి వాటిని ఫేస్‌ చేశాను.

నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు పోయింది. నా ప్రైవసీని అతిక్రమించారు. నా కుటుంబం విచ్ఛిన్నమైంది’ అంటూ భావోద్వేగ పోస్ట్‌ను షేర్‌ చేసింది. దీంతో పాటు ప్రతిరోజు ఇటుకను కాంక్రీట్ కలిపి పేర్చాలని మీరు ఏ దారిలో వెళ్తున్నా అక్కడ ఒక ఇటుక పేర్చేందుకు ఉంటుందని.. కానీ ఆ ఇటుకను పేర్చేందుకు నువ్వు లేచి నిలబడాలి అంటూ పేర్కొంది.

మరో పోస్టులో.. కష్టపడి పని చేయండి. మీకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రతి రోజూ ఆవిష్కరించుకోండి అంటూ పేర్కొంది. ప్రస్తుతం సమంత షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విడాకుల తర్వాత సమంత మనసులో ఇంత బాధ ఉందా అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక స‌మంత సినిమాల విషయానికొస్తే.. య‌శోద పాన్ ఇండియా సినిమాతో పాటు డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తోంది.. జాన్ పిలిప్ ద‌ర్శ‌క‌త్వంలో అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే హాలీవుడ్‌ మూవీలోనూ న‌టించ‌డానికి స‌మంత ఓకే చెప్పింది. ఈ సినిమాల‌న్నీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్నాయి. మ‌రో వైపు.. బాలీవుడ్‌లోనూ స‌మంత ఎంట్రీ ఇవ్వ‌నుంది.

- Advertisement -