చైతూ -సామ్‌ జంటగా మరో చిత్రం

299
Naga Chaitanya, Samantha,
- Advertisement -

షైన్ స్క్రీన్స్ తమ సంస్థ నుంచి రాబోయే రెండో చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది. యువ సామ్రాట్ నాగచైతన్య, సమంత జంటగా.. ‘నిన్ను కోరి’ లాంటి ఫీల్ గుడ్ ఫిలిమ్ తో డైరెక్టర్ గా పరిచయమైన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. “ఏమాయ చేసావే, మనం” లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం చైతూ-సామ్ కలిసి నటిస్తున్న చిత్రం కావడం, ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఈ జంట కలిసి వెండితెరపై కనిపించనుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Naga Chaitanya, Samantha,

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సాహు గారపాటి-హరీష్ పెద్ది మాట్లాడుతూ.. “నాగచైతన్య-సమంత జంటగా “నిన్ను కోరి” ఫేం శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం త్వరలో సెట్స్ కి వెళ్లనుంది. మా సంస్థ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న “కృష్ణార్జున యుద్ధం” ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతొంది. నాగచైతన్య-సమంతల కాంబినేషన్ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు.

- Advertisement -