సమంత పోస్ట్‌ వైరల్‌…

28
- Advertisement -

సమంత ఈ పేరు వింటే గూస్‌బంప్స్‌ రావడం ఖాయం. ఎందుకంటే అతి తక్కువ కాలంలో…గాడ్‌ఫాదర్‌ లేకుండా ఎదిగి నిలదొక్కుకోవడం అంటే చిన్న విషయం కాదు. అయితే గడిచిన దశాబ్దం కాలంలో తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలో నటించిన సమంత…గతేడాది మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయం చెప్పి అందరిని షాక్‌కు గురిచేసింది. ఈ వ్యాధి కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చిన సమంత…తాజాగా ఫ్యామిలీమ్యాన్‌ టీం తెరకెక్కిస్తున్న సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌కు రెడీ అవుతుంది. ఇందుకు సంబంధించిన పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది.

గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అన్నీ చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నా. గడిచిన ఏడెనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులు చూస్తూ ముందుకు సాగావు. వాటిని మర్చిపోవద్దు. ఆ క్లిష్ట పరిస్థుతులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గర్తుపెట్టుకో. అన్ని ఇబ్బందులను తట్టుకుని ధైర్యంగా అడుగులేశావు. నీ విషయంలో ఎంతో గర్వంగా ఉన్నా. నువ్వు కూడా నాలాగే గర్వపడు. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో అని చేసిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

గతంలో యశోద సినిమా తర్వాత దాదాపుగా ఏడెనిమిది నెలలుగా షూటింగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. అయితే ఇప్పుడు శాకుంతలం సినిమాకు విడుదల చేయనున్నట్టు టాలీవుడ్‌లో టాక్‌. అయితే పఠాన్ ఎఫెక్ట్‌ వల్ల విడుదల తేదీని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. దీనితో పాటు విజయ్‌తో కలిసి ఖుషి సినిమాను సగం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ప్రారంభించనుంది.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ నుంచి సర్ ప్రైజింగ్ న్యూస్

బాలీవుడ్ కొత్త జంటపై క్వీన్ పొగడ్త…

పవన్ లుక్ పై చర్చ

- Advertisement -