మళ్లీ కలవనున్న సమంత, నాగ చైతన్య

35
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య పెళ్లికి హాజరయ్యేందుకు మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖులు ఇటలీ చేరుకున్నారు. ఈ పెళ్ళిలో నాగచైతన్య, సమంత మళ్లీ కలవబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 1న ఇటలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం జరగనుంది. వీరి పెళ్లి కోసం ఈ మాజీ కపుల్స్ ఇటలీ పయనమయ్యారు. దీంతో చాలా రోజులు తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిలో ఈ మాజీ కపుల్స్ ఎదురపడనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ మాట్లాడుకుంటారా ? కలసి కనిపిస్తారా? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి ముందు వధూవరులతో ఫొటో షూట్ నిర్వహించారు. అయితే అందులో ఓ ఫ్యాన్ మేడ్ పిక్ వైరల్ అవుతోంది. వరుణ్ తేజ్-లావణ్య పక్కన రామ్ చరణ్, ఉపాసన నిల్చోగా.. ఎన్టీఆర్‌‌ను హేళన చేస్తూ స్టూల్‌పై నిల్చున్నట్లు ఎడిట్ చేశారు. దీంతో మెగా-నందమూరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్‌ నడుస్తోంది. దీంతో వరుణ్-లావణ్య పెళ్లిలో ఎన్టీఆర్‌కు అవమానం అంటూ కొన్ని న్యూస్ లు రాస్తున్నాయి.

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్ – అంతరిక్షం అనే రెండు సినిమాల్లో కూడా కలిసి నటించారు. కాకపోతే, ఆ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ మాత్రం బాగా స్ట్రాంగ్ గా చిగురించింది. ఆ ప్రేమే పెళ్లి వరకూ దారి తీసింది. వీరి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా సంతోషంగా ఉన్నారట.

Also Read:సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

- Advertisement -