కన్నీటి పర్యంతమైన సమంత…

65
- Advertisement -

గత కొంతకాలంగా ఆనారోగ్యంతో ఉన్న సమంత..తాజాగా సోమవారం శాకుంతలం సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ప్రెస్‌మీట్‌ సమయంలో ఒకసారిగా స్టేజీపై సమంత కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ… ఈ సినిమా చూశాక నాపై మరింత అభిమానం పెరుగుతుందన్నారు. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ప్రెస్‌మీట్‌కు వచ్చానని తెలిపింది. అయితే గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇన్ని రోజులుగా అందర్నీ నవ్విస్తూ ఉన్న సమంతకు ఇంత పెద్ద వ్యాధి సోకడంతో అభిమానులు ఎమోషనల్‌కు గురయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత కూడా సమంత ఆరోగ్యం కుదటపడకపోవడంతో చాలా మంది ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతవరకు సమంత ఆరోగ్యం కుదుటపడలేదని ..ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ప్రెస్ మీట్‌ వచ్చిన సమంతను చూస్తేనే అర్థమవుతుంది.

ఈసందర్బంగా దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ… సినిమాలో తెర ముందు హీరో సమంత…తెర వెనకాల మరో హీరో దిల్‌రాజు అని అన్నారు. ఈ సందర్భంగా గుణశేఖర్ ఎమోషన్‌ అవుతూ…ఒకానొక సమయంలో కంటతడి పెట్టుకున్నారు. దీంతో అక్కడ కూర్చున్న సమంత సైతం ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు. మనసులో నుంచి ఉప్పొంగిన బాధను ఒక్కసారిగా ఏడ్చేసింది. దీంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా ఆరవడంతో సమంత మళ్లీ నవ్వేసింది. సమంత భావోద్వేగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ ఆవుతుంది.

మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గుణశేఖర్‌ ఫిబ్రవరి 17న వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేయనున్నారు. మలయాళ నటుడు దేవ్‌ మోహన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే గుణశేఖర్‌కు రుద్రమదేవి తర్వాత దాదాపు శాకుంతలం కోసం ఏడేళ్ల సమయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి…

గ్రాండ్ గా ధమాకా 101 CR

గీతా ఫిల్మ్ .. ‘రైటర్ పద్మభూషణ్’

అలా చేయొద్దు ప్లీజ్: అనుష్క శర్మ

 

- Advertisement -