బన్నీ తర్వాత ఆ గౌరవం సమంతకే

22
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో జరుగుతున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని సమంతకు పిలుపు వచ్చింది. వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే పరేడ్‌ లో పాల్గొనే గొప్ప ఆహ్వానం సమంతకు దక్కింది. సమంతతో పాటు నటుడు రవికిషన్‌, నటి జాక్వైలిన్‌ ఫెర్నాండేజ్‌లను కూడా ఆహ్వానించారు. గతంలో ఈ కార్యక్రమానికి అభిషేక్‌ బచ్చన్, అల్లు అర్జున్‌, తమన్నా తదితరులు హాజరయ్యారు. తెలుగు నుంచి అల్లు అర్జున్ తర్వాత ఆ అరుదైన గౌరవం సమంతకు మాత్రమే దక్కింది.

న్యూయార్క్‌ లో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం తనకు లభించడం ఎంతో ఆనందంగా ఉందని సమంత చెప్పుకొచ్చింది. మరోవైపు సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్నట్లు సమంత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు మానసికంగా ఉండేందుకు యోగాసనాలు చేస్తూ, జిమ్‌‌ లో శ్రమిస్తూ తన ఫిట్‌ నెస్‌‌ ని కూడా పెంచుకుంటుంది. తాజాగా జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి షేక్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read:జగన్ కు షాక్…50 మంది టీడీపీ లోకి?

ఇక సమంత ప్రస్తుతం నటించిన ఖుషీ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, పాటలు సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేశాయి. అన్నట్టు ఈ సినిమాలో సమంత కొన్ని రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించింది అని చెబుతున్నారు. పైగా ఓ సాంగ్ లో అయితే భారీగా ఎక్స్ పోజింగ్ చేసిందని.. ఈ సాంగ్ లోనే విజయ్ దేవరకొండతో లిప్ లాక్ కూడా ఉంటుందని అంటున్నారు. మరి సమంత ఈ స్థాయిలో రెచ్చిపోతే.. ఖుషి సినిమాని చూడటానికి ఫ్యాన్స్ ఎగబడతారు.

Also Read:చర్మం నల్లబడుతుందా..ఇలా చేయండి!

- Advertisement -