అప్పుడే చంపేయకండి..సామ్ కంటతడి!

272
samantha cry
- Advertisement -

ఏ మాయ చేశావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సమంత. తొలి సినిమాతోనే గోల్డెన్‌ లెగ్‌గా ముద్రవేసుకున్న సామ్‌ తర్వాత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడే కాదు దక్షిణాదిలోని భాషల్లో నటించి మెప్పించింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా సామ్ నటించిన యశోద విడుదలకు సిద్దంగా ఉండగా సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది.

ఈ సందర్భంగా తనకు వచ్చిన వ్యాధి మయోసైటిస్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ఏమోషన్ అయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దక్షిణాదిలో సమంత స్టార్ హీరోలందరితో నటించింది. అంతే కాదు తనకు మాత్రమే సాధ్యమైన నటన, హావభాలతో లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకుంది.

జీవితంలో కొన్ని మంచి రోజులు ఉంటాయి.. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయని నా సోషల్ మీడియా పోస్టులో నేను చెప్పాను. ఇంకొక్క అడుగు ముందుకు వేయలేనేమో అనిపించింది. కానీ, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడి వరకు వచ్చానా అనిపిస్తుందని తెలిపింది. నాకు ప్రాణహాని ఉందని చాలా ఆర్టికల్స్‌లో చూశాను. నేను ఉన్న స్టేజ్‌లో ఇది ప్రాణహాని కాదు. ప్రస్తుతానికి అయితే నేను చనిపోను. కాబట్టి అలాంటి ప్రచారాన్ని ఆపండి అంటూ కన్నీరు పెట్టుకుంది. నా పరిస్థితి క్లిష్టమైందే కానీ పోరాటం మాత్రం ఆపనని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -