సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ` ఓ బేబీ`. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 5న సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంది.
మిక్కి జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అన్ని ఎలిమెంట్స్ను మిక్స్చేసిన ఔట్ అండ్ ఔట్ ఫన్ రైడర్గా ఈ సినిమా రూపొందింది. రీసెంట్గా విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్కు ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ శుక్రవారం విడుదలౌతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ థియేటర్లో సమంత నిలువెత్తు కటౌట్ను అభిమానులు ఏర్పాటు చేశారు. నగరంలోని దేవి థియేటర్లో సమంత చిరునవ్వులు చిందిస్తున్న భారీ కటౌట్ను పెట్టారు. దీన్ని సోషల్ మీడియాలో సమంత, అక్కినేని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/TeamTWTS/status/1146335868317077505