అలా ఉంటే చిరాకు…!

185
Samantha busy with films
- Advertisement -

సమంత ఏం చేసినా అందులో ఆమె తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత విజయవంతంగా ఏడేళ్లు పూర్తి చేసుకుంది. విలక్షణ పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సమంత వ్యక్తిగత జీవితంలోనూ విలక్షణ వ్యక్తిత్వంతో దూసుకుపోతోంది. ఈ బ్యూటీ సేవా రంగంలోనూ ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణ రాష్ట్రంలో చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన సమంత ఈ మధ్యనే తెలంగాణలో చేనేత కార్మికుల్ని కలిశారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు.

మొదటి నుంచి కూడా తనకి ఖాళీగా ఉండటమంటే చాలా చిరాకని సమంతా చెప్పింది. ఎప్పుడూ బిజీగా ఉండటాన్నే తాను ఎక్కువగా ఇష్టపడతానని అంది. అలాంటిది ఈ సారి తనకి కొంత విరామం లభించిందనీ . అయితే ఈ సమయాన్ని కూడా తాను వృథా చేసుకోలేదని చెప్పింది.

తన గురించి తాను లోతుగా ఆలోచించుకోవడానికి ఈ సమయం ఎంతగానో ఉపయోగపడిందని అంది. షూటింగ్స్ బిజీ వలన తాను కోల్పోయిన మానసిక పరమైన ఆనందాన్ని ఈ సమయంలో పొందానని చెప్పింది. మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవల్సిన అవసరం కూడా వుందని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ‘రాజుగారి గది 2’ చేస్తోన్న సమంతా, ఆ తరువాత సుకుమార్ – చరణ్ కాంబినేషన్లోని సినిమా కూడా చేయనుంది. ఇక మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో కూడా సమంత నటించనుంది. ఈ సినిమాలో సమంత జమునగా నటించబోతోందట! ఈ పాత్రకు మొదట చాలా మంది పేర్లు పరిశీలించినా, చివరకు సమంత అయితేనే సరిపోతుందని భావించారట! సమంత కూడా ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పేసిందట! అక్కినేని కుటుంబంతో సావిత్రికి, జమునకు విడదీయరాని బంధం ఉంది. ఈ సినిమా చేయడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు కోలీవుడ్‌ జనాలు.

- Advertisement -