కేరళకు సల్లూభాయ్‌ రూ.12కోట్లు..?

232
- Advertisement -

భారీ వర్షాలతో, వరదలతో అతలాకుతం అయిన కేరళ రాష్ట్రాన్ని ఎంతో మంది ప్రముఖులు భారీగా విరాళాలిచ్చి ఆదుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కూడా కేరళకు రూ.12 కోట్లు విరాళంగా ఇచ్చాడని టాక్. ఈ విషయాన్ని నటుడు జావెద్‌ జాఫ్రీయే ట్వీట్ చేయడంతో చాలా మంది నిజమే అని నమ్మారు.

 Salman Khan

ఇక ఆ విషయం గురించి ట్వీట్‌ చేసిన జావెద్‌ ను సోషల్‌ మీడియాల కొందరు ట్రోల్‌ చెయ్యడం స్టార్ట్‌ చేశారు. దాంతో తాను చేసిన ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు జావిద్‌. సల్మాన్ 12 కోట్లు ఇచ్చాడని తాను ఎక్కడో విన్నానని, అయితే ఆ విషయం ధృవీకరించుకోవాల్సి ఉందని మరో ట్వీట్ చేశాడు. అయితే దీనిపై ఇప్పటివరకు సల్మాన్‌ఖాన్ మాత్రం స్పందించలేదు.

- Advertisement -