- Advertisement -
పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలపై యువతులను హెచ్చరించారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.
పెళ్లి ఖాయమైందని శారీరకంగా కలవకూడదని, నిశ్చితార్థం తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని, పెళ్లి సమయం దగ్గర పడ్డాక తమ అసలు రంగు బయటపెడతారని.. అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తారని తెలిపారు సజ్జనార్.
ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకుని.. ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా అనే చనువును ఆసరాగా చేసుకుని యువతులతో సన్నిహితంగా మెలగడం, మాయమాటలతో వారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ శారీరకంగా లోబరుచుకోవడం వంటి ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయని హెచ్చరించారు.
Also Read:దేవుడికి మహాపచారం..అసెంబ్లీలోనే బయటపెడతాం!

- Advertisement -

