‘వెయ్ దరువెయ్’..సాయి ఫుల్ ఎనర్జీ

10
- Advertisement -

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద దేవరాజు పొత్తూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో వస్తున్న ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతల్ని నవీన్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. వెయ్ దరువెయ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘కేవీఆర్ గారు మాట్లాడితే నేరుగా గుండెకు తాకుతోంది. ఇంత తక్కువ టైంలో నిర్మాత దేవరాజ్ గారు, దర్శకుడు నవీన్ రెడ్డి గారు ఈ సినిమాను గొప్పగా తీశారు. సాయి రామ్ శంకర్ నాకు బ్రదర్ లాంటి వాడు. అతని ఫుల్ ఎనర్జీని ఈ చిత్రంలో చూడబోతోన్నారు. ఈ సినిమాలోని పాటలు, లిరిక్స్ బాగున్నాయి. భీమ్స్ మంచి పాటలే కాదు.. మంచి మాటలు కూడా మాట్లాడతాడని తెలిసింది. ఈ సినిమాలో కామారెడ్డి నుంచి హీరో వస్తాడు. కానీ కామారెడ్డి నుంచి హీరోలే వస్తారని కేవీఆర్ గారు నిరూపించారు. మార్చి 15న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణా రెడ్డి మాట్లాడుతూ.. ‘తక్కువ డబ్బుతో ఎక్కువ ఆనందాన్ని సినిమా ఇస్తుంది. సినిమా అనేది వ్యసనం కాదు. హరీష్, మాలా శ్రీ ప్రేమ ఖైదీ సినిమా కోసం ఆడిషన్స్‌కి వెళ్లాను. ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ వంటి హాస్యనటులంటే నాకు చాలా ఇష్టం. ఒక సినిమా హిట్టయితే ఎన్నో కుటుంబాల్లో సంతోషం నిండుతుంది. వచ్చిన సక్సెస్‌ను కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నన్ను ఈవెంట్‌కు పిలిచినందుకు థాంక్స్. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన హరీష్ శంకర్ గారికి, కేవీఆర్ గారికి థాంక్స్. మా సినిమా మార్చి 15న రాబోతోంది. అందరూ చూసి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.

డైరెక్టర్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన హరీష్ శంకర్ గారికి, కేవీఆర్ గారికి థాంక్స్. కథ చెప్పిన వెంటనే నిర్మాత దేవరాజ్ గారు ఓకే చెప్పారు. సాయి రామ్ శంకర్ గారు మా చిత్రానికి ఎంతో కష్టపడ్డారు. మార్చి 15న ఈ మూవీ రాబోతోంది. ఆడియెన్స్ అంతా మా సినిమాను చూడండి’ అని అన్నారు.

Also Read:TTD:ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

- Advertisement -