గీతా ఆర్ట్స్ #NC23లో సాయి పల్లవి

23
- Advertisement -

యువ సామ్రాట్ నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి పాన్ ఇండియా చిత్రం #NC23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన టీమ్, త్వరలోనే సినిమా షూటింగ్‌ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తెలుగుతో పాటు హిందీలో అనేక కల్ట్ హిట్‌లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు.

ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్‌లో భాగంగా, నిన్న సినిమాలో హీరోయిన్ కూడా టీమ్‌తో జాయిన్ అయ్యారు. అయితే ఈ రోజు మేకర్స్ ఆమె ఎవరో వెల్లడించారు. వెరీ బ్యూటీఫుల్, ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ గా టీంలో చేరారు. నాగచైతన్య, సాయి పల్లవి గతంలో సూపర్ హిట్ ‘లవ్ స్టోరీ’ చిత్రంలో కలిసి పనిచేశారు. కొత్త సినిమాలో తమ అద్భుతమైన కెమిస్ట్రీతో మనల్ని ఉర్రూతలూగించబోతున్నారు.

#NC23 నాగ చైతన్య, చందూ మొండేటి ఇద్దరికీ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందనుంది. కేవలం ప్రీ ప్రొడక్షన్ పనులకే నిర్మాతలు మంచి బడ్జెట్‌ను వెచ్చిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.

- Advertisement -