తప్పుగా అర్థం చేసుకున్నారు: సాయి పల్లవి

76
saipallavi
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. తాజాగా ‘గార్గి’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా జూలై 15న సినిమా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంలో చూపించిన హింస, గోరక్షక దళాలు చేస్తున్న దాడుల మధ్య తేడా ఏముంది? మానవత్వం గురించి ఆలోచించాలి అంటూ ఇటీవల చెప్పగా ఇవి వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి తన వ్యాఖ్యలపై స్పందించింది పల్లవి. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది. అయితే ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను. నా మాటల తాలూకు స్వభావాన్ని ఆ తర్వాత ఇంగ్లీష్‌లో పోస్ట్‌ చేయడంతో వివాదం సద్దుమణిగింది అన్నారు.

న్యాయ వ్యవస్థపై పోరాటం కనిపిస్తుంది. నిత్యం మనకు ఎదురయ్యే ఘటనలే సినిమాలో ఉంటాయి. నా మనసుని బాగా కదిలించిన కథ ఇది అని చెప్పుకొచ్చింది.

- Advertisement -