సింధుపై సైనా గెలుపు

223
Saina Nehwal beats PV Sindhu
- Advertisement -

ఇండోనేషియా మాస్టర్స్‌ టోర్నీ నుంచి పీవీ సింధు నిష్క్రమించింది. క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధుపై సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది. 37 నిమిషాల పాటు సాగిన పోరులో సింధు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.

మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన సైనా..సింధును చిత్తుచేసింది. 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సైనా అదే జోరుతో రెండో గేమ్‌ను ఆరంభించింది. మధ్యమధ్యలో మాత్రమే సింధు నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న సైనా 21-19తో రెండో గేమ్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌ సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో విజయం సాధించిన సైనా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సైనా-సింధు ఇప్పటి వరకు అంతర్జాతీయ వేదికపై మూడు సార్లు తలపడగా రెండుసార్లు సైనా విజయం సాధించింది.

- Advertisement -