“ప్రతిరోజూ పండగే”..మూడు రోజుల వసూళ్లు

429
sai tej
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయి తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రతిరోజూ పండగే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ సంస్ధ సంయుక్తంగా తెరకెక్కించిన ఈచిత్రానికి తమన్ సంగీతం అందించారు. కాగా ఈమూవీ ఈనెల 20న గ్రాండ్ గా విడుదలైంది. తొలి రోజు నుంచే ఈమూవీ సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది.

ఇక విడుదలైన మూడు రోజుల్లో ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా 23కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసినట్లు తెలిపారు చిత్రయూనిట్. ఇందుకు సంబంధించి ఓ పొస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ రోజుతో 25 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టవచ్చని అంటున్నారు. తేజూ కెరియర్లో ఇవి అత్యధిక వసూళ్లని చెబుతున్నారు. ఇక ఈవారం క్రిస్మస్ పండగ ఉండటంతో వసూళ్లు మరింత పెరగవచ్చని చెబుతున్నారు సినీ వర్గాలు.

సాయి తేజ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి. ఇక సాయి తేజ్ తన తర్వాతి మూవీ సోలో బ్రతుకే సో బెటర్ . ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది.సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీలో నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ యన్న ఈచిత్రాన్ని నిర్మస్తున్నారు. సమ్మర్ లో ఈమూవీని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -