అందుకే ‘డియర్ కామ్రేడ్’ లో నటించలేదుః సాయి పల్లవి

401
Sai Pallavi Dear comrade
- Advertisement -

రౌడి హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించింది. ఇక ఈమూవీలో విజయ్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన నటించింది. ఇటివలే విడుదలైన ఈచిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పాటలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

అయితే ఈసినిమాలో హీరోయిన్ గా మొదట రష్మీకకు బదులుగా సాయి పల్లవిని తిసుకోవాలని అనుకున్నారట. సాయి పల్లవికి కథను కూడా వినిపించారట దర్శకుడు భరత్. కానీ లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సాయి పల్లవి కథ నచ్చినా సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. ఆమె నో చెప్పడంతో విజయ్ తో గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మీకకు ఎంపిక చేశారు చిత్రయూనిట్.

ఈసినిమానే కాదు లిప్ లాక్ సీన్లు ఉన్న చాలా సినిమాలకు నో చెప్పింది సాయి పల్లవి. సంప్రాదాయంగా ఉండే కథలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరనన నటిస్తుంది. విజయ రష్మీక నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఈనెల 26న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలవుతుంది.

- Advertisement -