మళ్లీ సాయిపల్లవి కాంట్రావర్సీ కామెంట్స్‌!

181
- Advertisement -

ప్రేమమ్ సినిమాతో తెలుగు, తమిళ, మాలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. తెలుగులో ప్రేమమ్, ఫిదా సినిమాతో స్టార్ హిరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది ఈ మల్లు బ్యూటీ. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ పాత్రలను పక్కనపెట్టి కేవలం కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తు ముందుకుసాగుతోంది.

రీసెంట్‌గా విరాటపర్వం సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన సాయిపల్లవి తాజాగా మరోసారి తన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. టీవీల్లో వస్తున్న డాన్స్ రియాలిటీ షోస్‌పై తనకు నమ్మకం లేదని, ఛానెల్స్ డబ్బుకు ప్రాధాన్యత ఇస్తాయని, ప్రముఖుల వారసులకు మర్యాద, గౌరవం ఇస్తాయని కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది.

హీరోయిన్ కావటానికి ముందు సాయి పల్లవి కొన్ని డాన్స్ షోస్‌లలోనూ పాల్గొంది. 2008లో స్టార్ విజయ్ కండెక్ట్ చేసిన డాన్స్ షో రన్నరప్‌గా … 2009లో ఈటీవీలో వచ్చిన ఢీ 4లో సాయి పల్లవి కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -