“చిత్రలహరి” కి చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్..

310
ntr sai dharam Tej
- Advertisement -

సుప్రిమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చిత్రలహరి. దర్శకుడు కిషోర్ తిరుమల ఈచిత్రానికి దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్..నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ఎప్రిల్ 12న విడుదల కానుంది. ఇటివలే ఈసినిమా నుంచి విడుదలైన టీజర్ , సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. త్వరలోనే ఈచిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఈవేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిధిగా హాజరుకానున్నట్లు సమాచారం.

ఈసినిమా నిర్మాణ సంస్ధ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ సంస్ధకు ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది. వారి ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ చిత్రలహరి ఆడియో వేడుకకు రానున్నాడని తెలుస్తుంది. అసలైతే ఈ ఆడియో ఫంక్షన్ కు రామ్ చరణ్ లేదా మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధులుగా రావాల్సి ఉన్నా..ఎపీలో ఎన్నికలు ఉండటంతో వారు మీడియాకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వాళ్లు ఈ ఫంక్షన్ కు రావడం లేదని తెలుస్తుంది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న సాయి తేజ్ కు ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ రాకతో ఈసినిమాకు మరింత పాజిటివ్ గా మారనుంది.

- Advertisement -