తేజ్ “చిత్రలహరి” టీజర్ కు ముహుర్తం ఖరారు

318
sai dharam tej chirta lahari
- Advertisement -

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత కొద్ది రోజులుగా వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నేను శైలజ మూవీ దర్శకుడు కిషోర్ తిరుమలతో చేస్తున్నాడు. ఈచిత్రానికి చిత్రలహరి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈమూవీలో తేజ్ సరసన హలో మూవీ హీరోయిన్ కళ్యాణ్‌ ప్రియదర్శన్, నివేద్ హేతురాజ్ లు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం హైదరబాద్ పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈమూవీ టీజర్ విడుదల తేదిని ప్రకటించారు చిత్రయూనిట్.

రేపు ఉదయం 9గంటలకు ఈమూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగి సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో కిషోర్ తిరుమల కొంచెం స్పెషల్ అని చెప్పుకోవాలి. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈచిత్రానికి హైలెట్ గా నిలవనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో, సునీల్ .. వెన్నెలకిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. మే లో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.

- Advertisement -