ఆకట్టుకుంటున్న తేజ్ ‘చిత్రలహరి’ టీజర్(వీడియా)

321
tej chirtalahari
- Advertisement -

మెగా హీరో, సుప్రిమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా చిత్రలహరి . ఈచిత్రాన్ని నేను శైలజ మూవీ దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్ధ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శిని, నివేదా హేతురాజ్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా మూవీ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

టీజర్ ను చూస్తూంటే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండనుందని తెలుస్తుంది. టీజర్ లో సినిమాలోని ముఖ్యమైన పాత్రలను పరిచయం చేశారు. సునీల్ , వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రాసద్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్న ఈమూవీలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఈటీజర్ మీకోసం..

- Advertisement -