సంతన్న పిలుపుతో ప్రతి రోజూ పండుగే..

805
mp santhosh
- Advertisement -

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా’ఛాలెంజ్ కార్యక్రమం దేశ విదేశాల్లో ముందుకు దూసుకుపోతోంది. ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో ఇదివరకే ఎంతో రాజకీయ,సినీ,క్రీడా ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. తాజాగా ఈ ఛాలెంజ్‌ను ఎంపీ సంతోష్‌ కుమార్‌ ‘ప్రతిరోజూ పండగే’ చిత్ర బృందానికి విసిరారు.. అయితే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరో సాయిధరమ్ తేజ్‌, హీరోయిన్ రాశి ఖన్నాలు ఈ రోజు మొక్కలు నాటారు.

sai tej

సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర బృందం గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటారు. పరిసరాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్ స్వీకరించాలని రాశి ఖన్నా కోరింది. దీనికి సంబంధించిన ఫొటోలను రాశి ఖన్నా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

https://twitter.com/RaashiKhanna/status/1207554843679657984

- Advertisement -